మీలో ఈ లక్షణాలు కనిపించాయా.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..

మనందరి శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన భాగం. మూత్రపిండాలు శరీరంలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. మూత్రపిండాలు శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపిస్తుంటాయి. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు అవసరం. మీకు కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే, అది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వాటితో పాటు కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలతో ఈ రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

శరీరంలో కాల్షియం అధికంగా ఉంటే సోడియం, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ప్రస్తుతం కిడ్నీ స్టోన్ సమస్య వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, కొన్నిసార్లు ఈ రాళ్లు చాలా చిన్నదిగా ఉంటుంది. అది త్వరగా బయటపడదు. కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి చాలా భరించలేనిది అని అందరికీ తెలుసు. ముఖ్యంగా మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాల్సిందే. అయితే డాక్టర్ ఇచ్చిన ముందులతో పాటు మన వంట ఇంట్లో ఉండే వాటిని కూడా ఉపయోగించి కిడ్నీ స్టోన్స్ ను వదిలించుకోవచ్చు.

కిడ్నీలో స్టోన్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..
మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే, మీ పొత్తికడుపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతో విపరీతంగా వాంతులు అవుతుంటాయి. లేకుంటే వికారంగా అనిపిస్తుంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం పడవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో తీవ్రమైన మంట వస్తుంది. అలాగే జ్వరం కూడా వస్తుంది. అకస్మాత్తుగా చెమటలు పట్టడం ప్రారంభమవుతుంది.

కిడ్నీ స్టోన్ నొప్పి నుంచి ఉపశమనం..
మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే ఎప్పుడైనా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి, మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. రాళ్లు రాకుండా ఎక్కువ నీరు తాగాలి. ఆహారంలో సోడియం మొత్తాన్ని చేర్చాలి. ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లు, కూరగాయల వినియోగాన్ని తగ్గించాలి.

కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని తులసి తీసుకోవడం వల్ల తగ్గుతుంది. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది అనేక శారీరక సమస్యలను దూరం చేస్తుంది. కషాయాలను కూడా తయారు చేసి తాగవచ్చు. తులసిలో విటమిన్ బి ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను దూరం చేస్తుంది. ఇది ఆహారంలో ఉప్పుతోపాటు పుల్లని రుచిగా ఉంచుతుంది. మీరు తులసి ఆకులను తినవచ్చు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో దీన్ని నమిలితే, కిడ్నీ స్టోన్ కరిగి శరీరం నుంచి బయటకు వస్తుంది. ఉల్లిపాయను పచ్చిగా తినాలి. దీని రసాన్ని రోజూ 1-2 టీస్పూన్లు తాగుతుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు.ద్రాక్షలో పొటాషియం, నీరు ఎక్కువగా ఉంటుంది. సోడియం క్లోరైడ్ చాలా తక్కువగా ఉంటుంది. జామకాయ తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

గమనిక: పైన పేర్కొన్న సూచనలన్నీ కేవలం మీ అవగాహన కోసమే. ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించొద్దు.  కిడ్నీలో రాళ్లు కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా Salaha.in లో యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. కన్సల్టేషన్ ఫీజుపై 50% డిస్కౌంట్ పొందడానికి 7815970045 కాల్ చేయండి.

Source:tv9telugu


Forgot password?

  Accept to Terms & Conditions

Lost your password? Please enter your Mobile Number. You will receive your Password to your Mobile Number.


Close

We will ask few questions to connect with your Doctor

Close